చంద్రబాబు ఓ గజదొంగ.. ఇప్పుడు ఆయన కన్ను దేశంపై పడింది!: కన్నా లక్ష్మీనారాయణ

  • ఏపీని దొంగలతో కలిసి దోచుకున్నారు
  • కాంగ్రెస్ పార్టీతోనూ చేతులు కలిపారు
  • అన్నింటినీ మోదీకి అంటించడం సరికాదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ గజదొంగ అని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. దొంగలతో కలిసి చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు కన్ను దేశంపై పడిందనీ, దేశాన్ని దోచుకోవడానికి సిద్ధం అవుతున్నారని దుయ్యబట్టారు. అందుకే గతంలో తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నా మాట్లాడారు.

ఎక్కడ ఏం జరిగినా దాన్ని చంద్రబాబు ప్రధాని మోదీకి ముడిపెడుతున్నారని కన్నా మండిపడ్డారు. ఇది అసలు మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు, నిర్మాణాలు పూర్తికాకుండానే హైకోర్టును తెచ్చుకున్నారని దుయ్యబట్టారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
thief
allegation
India
Congress
BJP
Telugudesam
Narendra Modi
kanna
lakshmi narayana

More Telugu News